Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
దేశ ప్రగతికి తెలంగాణే గ్రోత్ ఇంజన్: సీఎం రేవంత్ రెడ్డి

దేశ ప్రగతికి తెలంగాణే గ్రోత్ ఇంజన్: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల అభివృద్ధికి జాతీయ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరారు. మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇంధన వినియోగంలో సంయమనం పాటించాలి: ప్రధాని మోడీ పిలుపు

ఇంధన వినియోగంలో సంయమనం పాటించాలి: ప్రధాని మోడీ పిలుపు

హైదరాబాద్‌లో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జాతీయ రహదారులు, రైల్వేలు, పారిశ్రామిక ప్రాజెక్టులతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణలో ఈ ఏడాది యథావిధిగా ఇంటర్‌ ప్రవేశాలు

తెలంగాణలో ఈ ఏడాది యథావిధిగా ఇంటర్‌ ప్రవేశాలు

ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రతిపాదనపై సాంకేతిక అంశాలు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అల్మాస్‌పేట్ జంక్షన్ పేరు వివాదం..సెక్షన్ 144 అమలు

అల్మాస్‌పేట్ జంక్షన్ పేరు వివాదం..సెక్షన్ 144 అమలు

అల్మాస్‌పేట్ జంక్షన్ పేరు మార్పు అంశంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాళ్ల దాడులు, నిరసనల నేపథ్యంలో పోలీసులు సెక్షన్ 144 అమలు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. సామాజిక సామరస్యాన్ని భంగం కలిగించేందుకు ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణలో నేటి నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు

తెలంగాణలో నేటి నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు

హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే సభతో విద్యా శాఖ వారోత్సవాలకు నాంది పలుకనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు, విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనలు, అవార్డుల ప్రదానం చేపట్టనున్నారు.

కాంగ్రెస్ పాలనలో కల్లాల్లో రైతుల కన్నీళ్లు: మాజీ మంత్రి హరీష్‌‌రావు

కాంగ్రెస్ పాలనలో కల్లాల్లో రైతుల కన్నీళ్లు: మాజీ మంత్రి హరీష్‌‌రావు

మెదక్ జిల్లా కర్ణాల్పల్లి కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్‌‌రావు, 25 రోజులు గడిచినా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యం నిల్వలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఐదోసారి పుదుచ్చేరి సీఎంగా ఎన్. రంగసామి.. రాష్ట్రపతి నియామకం

ఐదోసారి పుదుచ్చేరి సీఎంగా ఎన్. రంగసామి.. రాష్ట్రపతి నియామకం

మే 13న పదవీ స్వీకారం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కు 30 సభ్యుల సభలో 18 స్థానాలు లభించాయి. ఎన్‌ఆర్ కాంగ్రెస్ 12 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానం అందించారు.

అమ్మ లేని ఇల్లు.. పారిశుధ్య కార్మికులు లేని వీధి ఒక్కటే:ఎమ్మెల్యే గల్లా మాధవి

అమ్మ లేని ఇల్లు.. పారిశుధ్య కార్మికులు లేని వీధి ఒక్కటే:ఎమ్మెల్యే గల్లా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మహిళా పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం నివాసాలకు ప్రధాని మోడీ

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం నివాసాలకు ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఆదివారం అత్యంత ఆత్మీయంగా సాగింది. అధికారిక పనులతో తీరిక లేకుండా గడిపే ప్రధాని, తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లడం విశేషం. కేవలం రాజకీయాలే కాకుండా, వ్యక్తిగత అనుబంధాలకు ప్రాధాన్యతనిస్తూ సాగిన ఈ పర్యటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడ: వైసీపీ నేత బొడ్డేడ ప్రసాద్

మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడ: వైసీపీ నేత బొడ్డేడ ప్రసాద్

మునగపాకలో మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర లేక నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ రైతులను కలిసి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.రైతులకు తక్షణమే గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం:మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం:మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్

రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కృష్ణ నగర్ కొత్తరోడ్డులోని వీవీ గార్డెన్స్‌లో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మాతృ దినోత్సవం సందర్బంగా భరత్ రామ్ ఫౌండేషన్ తరపున ఈ మెగా మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వేలాది మంది పేద ప్రజలకు నిపుణులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

రాష్ట్రాల సమగ్ర అభివృద్ధే మోడీ ప్రభుత్వ లక్ష్యం:కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్రాల సమగ్ర అభివృద్ధే మోడీ ప్రభుత్వ లక్ష్యం:కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌లో రూ. 9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గత 11 ఏళ్లలో తెలంగాణలో 2,600 కి.మీ. జాతీయ రహదారులు నిర్మించామని, 42 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కొనసాగుతోందన్నారు.

ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ

ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ

రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనుల పురోగతిపై ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చర్చించారు. ప్రమాదాలు అధికంగా ఉన్న ఎన్‌హెచ్-65ను 8 లేన్లుగా విస్తరించి, ఎల్బీనగర్–హయత్‌నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్‌ను వేగవంతం చేయాలని కోరారు.

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి... డీజీపీ కార్యాలయం ముట్టడించిన బీఆర్ఎస్వీ

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి... డీజీపీ కార్యాలయం ముట్టడించిన బీఆర్ఎస్వీ

మైనర్ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు పెద్దఎత్తున డీజీపీ కార్యాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది.. బాధిత కుటుంబాన్ని వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని, కుటుంబానికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మళ్లీ మొదలవ్వనున్న నిప్పుల కొలిమి.. మే 12 నుంచి 'హీట్‌వేవ్ 3.0'

మళ్లీ మొదలవ్వనున్న నిప్పుల కొలిమి.. మే 12 నుంచి 'హీట్‌వేవ్ 3.0'

గత నాలుగు రోజులుగా కాస్త చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కనుంది. ఎండల తీవ్రత నుంచి మనకు లభించిన తాత్కాలిక ఉపశమనం ముగిసిందని మే 12 నుంచి రాష్ట్రంలో మూడవ విడత ఉష్ణ తరంగం (హీట్ వేవ్ 3.0) మొదలుకాబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఎండలు మునుపటి కంటే ఎక్కువగా ఉండబోతున్నాయని తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

విజయ్‌ ప్రమాణ స్వీకారం.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష

విజయ్‌ ప్రమాణ స్వీకారం.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష

చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య వేడుక ఘనంగా జరిగింది. 1967 తర్వాత డీఎంకే, ఏఐఏడీఎంకే కూటములకు వెలుపల ఒక నాయకుడు రాష్ట్ర పగ్గాలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

వెండితెర నుంచి రాజకీయ పీఠం వరకు.. దక్షిణాదిపై సినిమా ముద్ర

వెండితెర నుంచి రాజకీయ పీఠం వరకు.. దక్షిణాదిపై సినిమా ముద్ర

ఎంజీఆర్, కరుణానిధి, ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్, విజయ్ వరకు పలువురు నటులు ప్రజాదరణను రాజకీయ బలంగా మలిచారు. తెరపై ఏర్పడిన అభిమానాన్ని ఓట్లుగా మార్చుకుంటూ దక్షిణాది రాజకీయాల దిశను ప్రభావితం చేశారు.

తొలి పలుకు - తెలుగు వార్తలు & కథలు